వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, హెబ్బాపటేల్ తదితరులు నటించనున్న సినిమా `ఆద్య`.
వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, బ్యానర్ మీద S.రజినీకాంత్. P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), నిర్మిస్తున్నారు. , డి.ఎస్.కె. స్క్రీన్ సమర్పిస్తున్నారు. ఆద్య చిత్రానికి ఎం.ఆర్.. కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు.
నేడు అనగా శనివారంనాడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆద్య సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ఆమె సరికొత్తగా కనిపించారు. ఇప్పటికే ఈ లుక్కు మంచి స్పందన లబిస్తోంది. గత జనవరి 11నే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.